ganiindustry

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధంగా ఉంది. ఈ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన సౌకర్యాలు, ఏర్పాట్లపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 15వ తేదీ లోపు అన్ని నవోదయ విద్యాలయాలు ప్రారంభించి తరగతులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది నియామకం, జిల్లావారీగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *